Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా అల్లర్లకు కారణమైన వారికి బుల్డోడర్ ట్రీట్మెంట్

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (16:43 IST)
ఇటీవల హర్యానా రాష్ట్రంలో ఒక్కసారిగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లు నుహ్ జిల్లాలో చోటు చేసుకోగా, భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో అల్లర్లకు కారణమైన వారిని గుర్తించిన ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులోభాగంగా, వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసింది. అక్రమంగా నిర్మించిన నిందితుల గుడిసెలను ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. వీరికి రాళ్ళదాడులు, దుకాణాల లూటీల్లో సంబంధం ఉన్నట్టుగా అదికారులు గుర్తించారు. దీంతో వారిపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. 
 
నుహ్ జిల్లాని తపురలో అక్రమంగా నిర్మించిన 250 దాకా గుడిసెలను అధికారులు తొలగించారు. శుక్రవారం ఈ మేరకు భారీ ఎత్తున పోలీస్ దళాలను అక్కడ బందోబస్తు కోసం మొహరించి బుల్డోజర్లతో గుడిసెలను కూల్చివేశారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి గత నాలుగేళ్లలో చాలా మంది వలస వచ్చి, స్థలాలను ఆక్రమించుకుని, గుడిసెలు వేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. వీరంతా కలిసి అల్లర్లలో పాల్గొన్నారు. రాళ్లదాడులు, దుకాణాల లూటీల్లో వీరి హస్తమున్నట్టు పేర్కొంటున్నారు. పైగా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించిన అధికారులు వారి ఫోటోలను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments