Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాభై తులాల బంగారం, 2.5 కిలోల వెండి, రూ.3.20లక్షలు గోవిందా!

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (15:24 IST)
ఆగ్రాలోని బఝేరా ప్రాంతం అచ్నేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో సుమారు యాభై తులాల బంగారం, 2.5 కిలోల వెండి, మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్ళారు. ఈ ఘటనపై ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. బఝేరా ప్రాంతానికి నివసిస్తోన్న కేలాల్, అతడి కుమారుడు లవకుష్ రాత్రివేళ ఇంటి బయట వరండాలో నిద్రపోయారు. అయితే పడుకునే ముందు వారు అనుకోకుండా ఇంటి తలుపులకు తాళం వెయ్యడం మర్చిపోయారు. 
 
ఇదే అదనుగా చేసుకున్న దొంగలు.. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి.. అల్మారాలో ఉన్న సుమారు యాభై తులాల బంగారం, 2.5 కిలోల వెండి, మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఇక తెల్లారి లేచి చూసేసరికి.. గది తలుపులు తెరిచి ఉండటాన్ని తండ్రీకొడుకులు గుర్తించారు. 
 
లోపలికి వెళ్లి చూడగా అరలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments