Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ వైపు నిరాహార దీక్ష... మరోవైపు బిర్యానీ, మద్యం.... ఏరులై పారింది.. ఎక్కడ? (వీడియో)

కావేరీ జల మండలి ఏర్పాటు కోసం తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే నేతలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా కేంద్రం కావేరీ మేనేజ్‌మెంటు బోర్డు (సీఎంబీ

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (12:31 IST)
కావేరీ జల మండలి ఏర్పాటు కోసం తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే నేతలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా కేంద్రం కావేరీ మేనేజ్‌మెంటు బోర్డు (సీఎంబీ) ఏర్పాటు చేయనందుకు నిరసనగా... మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. 
 
రాజధాని చెన్నైలో జరిగిన నిరాహారదీక్షలో ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంలు పాల్గొన్నారు. అలాగే, ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగిన దీక్షా శిబిరాల్లో రాష్ట్ర మంత్రులు, ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 
 
అయితే, ఈ నిరాహారదీక్ష ముగిసిన తర్వాత విస్తుబోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీక్షా శిబిరం వేదికలపై రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, నాయకులు నిరాహార దీక్షలో కూర్చోగా.. మరోవైపు కార్యకర్తలకు బిర్యానీ, మద్యం పంపిణీ చేశారు. వేలూరు, కోయంబత్తూరు, సేలం, పుదుకోట తదితర జిల్లాలో ఈ దృశ్యాలు కనిపించాయి. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
అలాగే, తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దృశ్యాలు చూస్తే అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు కావేరీ జల మండలి కోసం ఎంత నిజాయితీగా పోరాడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చని విపక్ష పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరు ఈ దృశ్యాలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments