Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాట సంచలనం... 89 మంది డీఎంకే ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా?

తమిళనాట పెనుసంచలనం చోటుచేసుకోనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారును కాపాడేందుకు టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు శాసనసభ స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేశారు.

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (13:08 IST)
తమిళనాట పెనుసంచలనం చోటుచేసుకోనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారును కాపాడేందుకు టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు శాసనసభ స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాలను విస్మయపరిచింది. దీంతో అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఇదిలావుంటే, ప్రధాన విపక్షమైన డీఎంకే ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలను రక్తికట్టిస్తున్నాయి. అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటీషన్‌పై మద్రాసు హైకోర్టు రేపు విచారణ జరుపనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం డీఎంకే అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తోంది.
 
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అన్నాడీఎంకే నుంచి ఎమ్మెల్యేలు అనర్హతకు గురైన నేపథ్యంలో తమ పార్టీకి చెందిన 89 మంది ఎమ్మెల్యేలతో స్టాలిన్ మూకుమ్మడి రాజీనామా చేయించనున్నారని తెలుస్తోంది. అలా చేయడం ద్వారా మధ్యంతర ఎన్నికలకు వెళ్లవచ్చని, దీంతో అన్నాడీఎంకేను ఓడించవచ్చని డీఎంకే వ్యూహం రచించింది. 
 
వీరితో పాటు 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం డీఎంకేకు 89 మంది కాంగ్రెస్‌కు 8 మంది, ముస్లిం లీగ్‌కు ఒక సభ్యుడు, ఇద్దరు స్వతంత్రులతో కలుపుకుని మొత్తం 100 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా రాజీనామాలు చేస్తే ఈ చర్య రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారనుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments