Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల పనితీరు భేష్ : ప్రణబ్ ముఖర్జీ

Webdunia
మంగళవారం, 21 మే 2019 (11:47 IST)
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం విజయవంతంగా పూర్తిచేసింది. ఎన్నికల పనితీరుపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. ఎన్నికల తీరు భేషుగ్గా ఉందని తెలిపారు. నిజానికి ఎన్నికల సంఘం పనితీరు అధ్వాన్నంగా ఉందని దేశంలోని విపక్ష పార్టీలన్నీ మండపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రణబ్ ముఖర్జీ మాత్రం ఈసీ పనితీరును మెచ్చుకోవడం ఇపుడు చర్చనీయాంశమైంది. 
 
ఆయన మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, 'మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందంటే దానికి ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ కారణం. సుకుమార్ సేన్ నుంచి ఇప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వరకు ప్రతి ఒక్కరూ తమ విధులను చాలా గొప్పగా నిర్వహించారు. ఎన్నికల సంఘాన్ని నిందించడం సరికాదు' అని దాదా అన్నారు. దేశంలోని వ్యవస్థలన్నీ ఎన్నో ఏళ్లుగా బలంగా నిర్మించబడుతూ వస్తున్నాయి... అన్ని కీలక వ్యవస్థలు అద్భుతంగా పని చేస్తున్నాయని కితాబిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments