Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా మఫ్లర్ ధర రూ.80 వేలు.. రాహుల్ టీ షర్టుపై రాజకీయాలా?

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (14:15 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇపుడు కేరళ రాష్ట్రంలో విజయవంతంగా సాగుతోంది. అయితే, ఈ యాత్రా సమయంలో రాహుల్ గాంధీ ధరించిన ఓ టి షర్టు ధర రూ.45 వేలు అంటూ బీజేపీ శ్రేణులు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది వైరల్ అయింది. బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేతలు ధీటుగానే కౌంటరిచ్చారు. రాహుల్ ధరించిన టీ షర్టు ధర రూ.45 అయితే, ప్రధాని మోడీ ధరించే కళ్లద్దాల ధర రూ.85 వేలు, ఆయన ధరించే కోటు ధర రూ.10 లక్షలు అంటూ కౌంటరిచ్చారు. దీంతో బీజేపీ శ్రేణులు తోకముడిచాయి. 
 
తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. టీ షర్టుల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ధరించే మఫ్లర్ ధర రూ.80 వేలకు పైనే ఉంటుందని చెప్పారు. బీజేపీ నేతలు ధరించే సన్ గ్లాసెస్ ధర రూ.2.50 లక్షలకు పైగానే ఉంటుందని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో బీజేపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని నిలదీశారు. 
 
"బీజేపీ నేతలకు రూ.2.50 లక్షల సన్ గ్లాసెస్‌, రూ.80 వేల మఫ్లర్లు ధరిస్తూ రాహుల్ గాంధీ టీ షర్ట్ గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర హో మంత్రి అమిత్ షా ధరించే మఫ్లర్ ధర రూ.80 వేలకుపైనే ఉంటుంది. అయినా టీ షర్టులపై బీజేపీ రాజకీయాలు చేస్తుంది" గెహ్లాట్ కౌంటరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments