Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలులో ఖైదీల కోసం ఎటిఎం..ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (18:21 IST)
బీహార్‌లోని పూర్నియా సెంట్రల్‌ జైలులో ఖైదీలు వారి రోజువారీ అవసరాల కోసం డబ్బును తీసుకోవడానికి జైలు ప్రాంగణంలో ఎటిఎం (ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషిన్‌) ఏర్పాటు చేశారు.

జైలు గేటు వద్ద ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు డబ్బును డ్రా చేసుకునేందుకు జైలు లోపల ఎటిఎం ఏర్పాటు చేశామని పూర్నియా జైలు సూపరింటెండెంట్‌ జితేంద్రకుమార్‌ చెప్పారు.

పూర్నియా జైలులో 750 మంది ఖైదీలుండగా, వారిలో 600 మంది ఖైదీలకు బ్యాంకులో ఖాతాలున్నాయి. వీరిలో 400 మందికి ఎటిఎం కార్డులను జారీ చేశామని, మిగిలినవారికి కూడా ఎటిఎం కార్డులను త్వరలో జారీ చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు.

జైలులోని ఖైదీలకు 4 నుంచి 8 గంటల పనికి రోజుకు 52 రూపాయల నుంచి 103 రూపాయల వరకు వేతనాన్ని చెల్లిస్తున్నారు. జైలులోని చిన్న, కుటీర పరిశ్రమల్లో పనిచేసిన ఖైదీలకు వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

ఖైదీలు జైలులో ఫేస్‌ మాస్కులు తయారు చేస్తున్నారు. జైలు మాన్యువల్‌ ప్రకారం ఒక్కో ఖైదీ 500 రూపాయల నగదును డ్రా చేసి ఉంచుకునేందుకు అనుమతి ఉంది. ఖైదీలు వారి వేతనాల డబ్బు నుంచి సబ్బులు, హెయిర్‌ ఆయిల్‌, తినేందుకు చిరుతిళ్ల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చని జైలు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments