Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్రీ విధ్వంసం కేసు పునర్విచారణ.. అద్వానీపై అభియోగాలు తప్పవా?

బాబ్రీ విధ్వంసం కేసు పునర్విచారణలో నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్. కె. అద్వానీకి కష్టాలు తప్పేలాలేవు. అద్వానీతో పాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులపై కూడా శుక్రవారం సీబ

Webdunia
గురువారం, 25 మే 2017 (13:34 IST)
బాబ్రీ విధ్వంసం కేసు పునర్విచారణలో నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్. కె. అద్వానీకి కష్టాలు తప్పేలాలేవు. అద్వానీతో పాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులపై కూడా శుక్రవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం అభియోగాలు నమోదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బాబ్రీ కూల్చివేత అంశంలో అద్వానీతో పాటు పలువురు బీజేపీ అగ్ర నేతలపై వున్న కేసును 2011లో అలహాబాద్ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. 
 
అయితే సీబీఐ దీన్ని సుప్రీం కోర్టులో సవాలు చేయడంతో గత నెలలో సుప్రీం కోర్టు ఈ కేసును పునర్విచారణకు స్వీకరించడంతో అద్వానీకి కొత్త చిక్కొచ్చి పడింది. అద్వానీ రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీచేస్తారనుకున్న నేపథ్యంలో బాబ్రీ కేసు పునర్విచారణకు రావడం చర్చనీయాంశమైంది. 
 
బాబ్రీ కేసు విచారణను రెండేళ్లలోపు ముగించాలని కూడా సుప్రీం కోర్టు గత ఏప్రిల్ 19న సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 120-బి ప్రకారం అద్వానీ సహా తదితరులపై కొత్తగా అభియోగాలు మోపవచ్చునని తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments