Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులను కాదు.. ముఖ్యమంత్రి మమతను చెంప దెబ్బలు కొట్టాలి : బెంగాల్ చీఫ్

వరుణ్
మంగళవారం, 30 జనవరి 2024 (13:19 IST)
విద్యార్థులు చదువుల్లో రాణించలేకపోవడం వారి తప్పుకాదని, విద్యావ్యవస్థను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భ్రష్టు పట్టించారని, అందువల్ల ఆమె చెంపలు పగులగొట్టాలని భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బెంగాల్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సీఎం మమతా బెనర్జీ భ్రష్టుపట్టించారని ఆరోపించారు. మన పిల్లలు చదువుల్లో రాణించకపోవడం వారి తప్పు కాదన్నారు. తల్లిదండ్రులు పిల్లన్ని కొట్టడానికి బదులు ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెంపలు పగులగొట్టాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుకాంత మజుందరా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. 
 
మరోవైపు, సుకాంత చేసిన వ్యాఖ్యలపై అధికార టీఎంసీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుపెట్టి, భౌతిక దాడులకు ఆయన ప్రేరేపిస్తున్నారంటూ ఆరోపించారు. తక్షణం సీఎం మమతతో పాటు రాష్ట్ర ప్రజానీకానికి ఆయన క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ సుకాంత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కాగా, సుకాంత వ్యాఖ్యలకు నిరసనగా టీఎంసీ మహిళా విభాగం మంగళవారం రాజధాని కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments