Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోక్సో కేసులో మాజీ ముఖ్యమంత్రి యడ్డీకి బిగ్ రిలీఫ్!

ఠాగూర్
శుక్రవారం, 14 మార్చి 2025 (14:51 IST)
పోక్సో కేసు నుంచి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప(యడ్డీ)కు స్వల్ప ఊరట లభించింది. మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించారన్న కేసులో యడ్యూరప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇందులో న్యాయస్థానం ఆయనకు స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 15వ తేదీ ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకావాలంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశించింది. దీనిపై ఆయన కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా, కింది కోర్టు సమన్లను నిలిపివేసింది. 
 
కాగా, 17 యేళ్ల బాలికపై యడ్యూరప్ప లైంగికదాడికి పాల్పడినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి గత యేడాది ఫిబ్రవరి 2వ తేదీన నాడు ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. 
 
దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే, ఈ ఆరోపణలను యడ్యూరప్ప కార్యాలయం ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇదే తరహా ఆరోపణలు చేశారని పేర్కొంది. ఈ నేపథ్యంలో యడ్యూరప్పకు కర్నాటక హైకోర్టు స్వల్ప ఊరట కల్పించింది. కాగా, ఈ ఆరోపణల కేసు కర్నాటక రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం