Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ కేసు : ముంబైకు వెళ్లిన బీహార్ వెళ్లిన ఐపీఎస్ బలవంత క్వారంటైన్

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (11:43 IST)
బాలీవుడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు పలు రకాలైన మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో సరికొత్త ట్విస్ట్ తాజాగా చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, ముంబైకు వెళ్లిన బీహార్ ఐపీఎస్ అధికారిని నిర్బంధ హోం ఐసోలేషన్‌కు పంపించారు. 
 
సుశాంత్‌ను ఆయన ప్రియురాలు సినీ నటి రియా చక్రవర్తి మోసం చేసిందంటూ మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాట్నా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఆదివారం పాట్నా నుంచి ప్ర‌త్యేకంగా ఐపీఎస్‌ విన‌య్ తివారీ ముంబైకి వ‌చ్చారు. కేసును కూలంకుషంగా విచారించేందుకు ఆయ‌న రంగంలోకి దిగారు. అయితే ముంబైకి చేరుకోగానే అక్క‌డి మున్సిప‌ల్ అధికారులు ఆఫీస‌ర్‌ను క్వారెంటైన్ చేశారు. 
 
బ‌ల‌వంతంగా ఆ ఆఫీస‌ర్‌ను క్వారెంటైన్ చేసిన‌ట్లు బీహార్ డీజీపీ గుప్తేశ్వ‌ర్ పాండే వెల్లడించారు. రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో బీఎంసీ అధికారులు విన‌య్ తివారీని క్వారెంటైన్ చేసిన‌ట్లు డీజీపీ పాండే ట్వీట్ చేశారు. ఐపీఎస్‌ మెస్‌లో అత‌నికి వ‌సతి ఇవ్వ‌లేద‌ని, గోరేగావ్‌లోని గెస్ట్‌హౌజ్‌లో అత‌ను స్టే చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. దీంతో కేసు ఆస‌క్తిక‌రంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments