Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ సీఎం ఇంట్లో దెయ్యాలు.. వదిలివెళ్లిన మాజీ సీఎం లాలూ

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (13:54 IST)
బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇపుడు ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. అదేంటంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ నివాసంలో దెయ్యాలు తిరుగుతున్నాయట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రే స్వయంగా వెల్లడించారు. పైగా, ఈ దెయ్యాలను వదిలి వెళ్లింది కూడా ఎవరో కాదట. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అని ఆయన సెలవిచ్చారు. ఇంతకీ నితీశ్ కమార్ అలా వ్యాఖ్యానించడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. 
 
కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర రాజధాని పాట్నాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన భవనం విశాలంగా ఉండేదని, ఇంటి వెనుక భాగంలో మట్టికుప్పలు, ఇంటి నలుమూలల్లో కాగితపు కవర్లు కనిపించాయని, తన కోసం కొన్ని దెయ్యాలను ఆ ఇంట్లో వదిలేసి వెళ్లానని లాలూ స్వయంగానే తనతో అన్నారని నితీశ్ వ్యాఖ్యానించారు. 
 
లాలూ తనదైన స్టయిల్‌లో ఈ మాటలు అనివుండవచ్చని నితీశ్ చెప్పినా, ఆయన మాటలు మాత్రం ఇప్పుడు బీహార్‌లో చర్చనీయాంశమయ్యాయి. గతంలో లాలూకు నష్టం కలిగించాలన్న ఉద్దేశంతో కాళీమాత ఆలయంలో నితీశ్ ప్రత్యేక పూజలు చేయించారని, ఈ విషయాన్ని తాంత్రికుల నుంచి తెలుసుకున్న లాలూ, పూజల ప్రభావం తనపై పడకుండా చూసుకునేందుకు ప్రత్యేక పూజలు చేశారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments