Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ప్రజలు చనిపోతున్నారు.. 24 గంటల్లో 42 మంది జలసమాధి

బీహార్ రాష్ట్రంలో వర్ష, వరద బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 42 మంది చనిపోయారు. దీంతో బీహార్‌లో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 482కు చేరింది. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా వ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (21:01 IST)
బీహార్ రాష్ట్రంలో వర్ష, వరద బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 42 మంది చనిపోయారు. దీంతో బీహార్‌లో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 482కు చేరింది. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా వరద మృతుల సంఖ్య 101కు చేరింది. 
 
కాగా, గత కొన్ని రోజులుగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. ఈ రాష్ట్రంలోని 19 జిల్లాల పరిధిలోని 1.72 కోట్ల మంది ఇంకా వరదముంపులోనే ఉన్నారు. జాతీయ విపత్తు నివారణ సంస్థకు చెందిన 28 బృందాలు, 630 మంది సైనికులు వివిధ బృందాలుగా విడిపోయి పునరావాస, సహాయక చర్యలు చేపడుతున్నా...  బాధితులను పూర్తి స్థాయిలో సురక్షిత ప్రాంతాలకు తరలించలేక పోతున్నారు. 
 
బీహార్‌లోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు నీటిముంపులోనే ఉన్నా.. వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. యూపీలో గత 24 గంటల్లో ఐదుగురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 101కి చేరింది. వేలాది గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments