Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో ముష్కరుల హల్చల్ - మోటారు బైకుపై వచ్చిన ప్రజలపై కాల్పులు (Video)

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (13:13 IST)
బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లాలో ఇద్దరు సైకోలు బీభత్సం సృష్టించారు. మోటారుబైకుపై బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి వచ్చి ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ కాల్పుల ఘటనతో బీహార్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ముష్కరుల కోసం వేట మొదలుపెట్టారు. 
 
బీహార్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో బెగుసరాయ్ పట్టణంలోని మల్హిపూర్ చౌక్ వద్దకు ఇద్దరు దుండగులు ఒక మోటార్ బైకుపై వచ్చారు. ఆ ప్రాంతంలో దుకాణాలు అధికంగా ఉండటంతో ప్రజలతో బాగాగ రద్దీగా ఉంది. అంతే ఒక్కసారిగా గుంపులుగా ఉన్న ప్రజలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపారు. 
 
అక్కడ నుంచి బరౌనీ థర్మల్ చౌక్, బరౌనీ, తేఘ్రా, బచ్వారా, రాజేంద్ర వంతెన వద్దకు కూడా ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చందన్ కుమార్ అనే 30 యేళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని బెగుసరాయ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసిన బీహార్ పోలీసులు.. ఇద్దరు ముష్కరుల కోసం గాలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఈ కాల్పుల ఘటన జరిగినప్పటికీ బుధవారం మధ్యాహ్నం వరకు దుండగులను పోలీసులు గుర్తించలేదు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments