Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు రాష్ట్రంలో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం - హానికారక పదార్థాలు..

వరుణ్
ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (10:45 IST)
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ తరహా నిర్ణయం పక్కనే ఉన్న పాండిచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. తాజాగా తమిళనాడు రాష్ట్రం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు చెన్నైలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో రోడమైన్ బి అనే రసాయనం అధిక మోతాదులో ఉన్నట్టు గుర్తించారు. కృత్రిమ రంగు కోసం పీచు మిఠాయితో దీనిని వినియోగిస్తున్నట్టు తేలింది. ఈ రసాయనాన్ని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. బట్టల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లలో దీన్ని అధికంగా వినియోగిస్తుంటారు. 
 
ఫుడ్ కలర్ కోసం ఉపయోంచే అవకాశమే లేదు. ఎందుకంటే దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలింది. ఈ రసాయనం శరీరంలోకి వెళితే కిడ్నీలు, లివర్‌లపై ప్రభావం చూపుతుందని, అల్సర్‌‍తో పాటు కేన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు గుర్తించారు. ఈ క్రమంలో పీచు మిఠాయిలలో దీనిని ఉపయోగిస్తున్నందున వీటి అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సుబ్రహ్మణ్యం తెలిపారు. పీచు మిఠాయి తయారీలో ఉపయోగించే రంగుల్లో కేన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని అందువల్ల వీటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments