Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంజయ్ కాకడే జోస్యం నిజమవుతుందా?.. ఆ ఎంపీ బీజేపీ ఆక్టోపసా?

గుజరాత్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చుక్కెదురయ్యేలా వుంది. గుజరాత్‌లో బీజేపీనే గెలుస్తుందని.. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్‌ అన్నీ కోడై కూస్తున్నాయి. అయితే గుజరాత్‌లో అయినా అక్కడ గెలిచేది కాంగ్రెస్‌నే అని ఓ

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (09:08 IST)
గుజరాత్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చుక్కెదురయ్యేలా వుంది. గుజరాత్‌లో బీజేపీనే గెలుస్తుందని.. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్‌ అన్నీ కోడై కూస్తున్నాయి. అయితే గుజరాత్‌లో అయినా అక్కడ గెలిచేది కాంగ్రెస్‌నే అని ఓ ఎంపీ జోస్యం చెప్పారు. అయితే ఆ ఎంపీ బీజేపీకి చెందిన వాడు కావడం మరో విశేషం. ఎగ్జిట్ పోల్స్ అవాస్తవమని, తమ పార్టీ ఓడిపోనుందని ఎంపీ సంజయ్ కాకడే అన్నారు. దీంతో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తరహాలో సంజయ్ కాకడే బీజేపీ ఆక్టోపస్ అని చర్చ సాగుతోంది. 
 
ఇంకా కాకడే మాట్లాడుతూ.. తాను జరిపించిన సర్వేలో 75 శాతం మంది ఓటర్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా నిలిచారని వెల్లడించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఓబీసీలు, పటేళ్లు, ముస్లింలు, దళితలు కాంగ్రెస్ వైపు నిలిచారని, అందుకే  కాంగ్రెస్ పార్టీని విజయం వరిస్తుందని సంజయ్ చెప్పేశారు. ఈయన జోస్యం నిజమయ్యేలా సోమవారం ఎన్నికల ఫలితాల్లో గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో వుంది. 
 
అయితే అన్ని ప్రధాన మీడియా సంస్థలు, సర్వే సంస్థలు గుజరాత్‌లో మరోసారి బీజేపీ గెలుపు ఖాయమని ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు విడుదల చేశాయి. ఈ తరుణంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ కకాడే మాత్రం.. బీజేపీ విజయం సాధించే అవకాశమే లేదన్నారు. శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా గుజరాత్‌లో బీజేపీ కష్టాలు తప్పవని చెప్పారు. అక్కడ తమ పార్టీకి ఎదురుగాలి వీస్తోందని కకాడే అన్నారు. 
 
182 అసెంబ్లీ స్థానాల్లో సంపూర్ణ మెజారిటీ గురించి తర్వాత.. కనీసం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని స్థానాలు (92) కూడా వచ్చే అవకాశం లేదని ఉద్ధవ్ ఠాక్రే జోస్యం చెప్పారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో తాను ఏకీభవించడం లేదని ఉద్దవ్‌ ఠాక్రే తేల్చిచెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments