Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి ఎంపీకి వీడని కష్టాలు... వారం రోజుల్లో కూల్చివేయాలంటూ...

Webdunia
శనివారం, 21 మే 2022 (19:36 IST)
మహారాష్ట్రలోని అమరావతి బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. ఇప్పటికే హనుమాన్ చాలీసా పఠనంపై చెలరేగిన వివాదంలో అరెస్టు అయిన నవనీత్ కౌర్ దంపతులు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఇపుడు మరో కష్టం వచ్చిపడింది. 
 
ముంబై నగర పరిధిలోని ఖర్ ఏరియాలో నవనీత్ కౌర్ ఇంటిలో కొంతభాగం అక్రమంగా నిర్మించారంటూ ముంబై నగర పాలక సంస్థ ఆమెకు నోటీసులు జారీచేసింది. ఈ అక్రమ నిర్మాణాన్ని వారం రోజుల్లో కూల్చివేయాలని లేనిపక్షంలో తామే కూల్చివేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ చాలీసా పఠించాలని డిమాండ్ చేసిన కౌర్‌ అందుకు ఆయన సమ్మతించకపోతే ఆయన ఇంటి ముందు బైఠాయించి హనుమాన్ చాలీసాను పఠిస్తానంటూ హెచ్చరికలు చేశారు. 
 
ఈ క్రమంలో సీఎం ఇంటికి వెళతారన్న అనుమానంతో కౌర్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ దంపతులకు పది రోజుల తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పది రోజుల పాటు వారు జైలు జీవితం గడిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments