Webdunia - Bharat's app for daily news and videos

Install App

గారెల కోసం గొడవ.. రుచిగా లేవని హోటల్ యజమాని గొంతుకోసేశాడు..

గారెల కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. క్షణికావేశంతో జరిగే హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. భావోద్వేగాలకు లోనై.. దారుణాలకు పాల్పడే ఘటనలు దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా గారెలు రుచిగా లేవనే చిన్

Webdunia
గురువారం, 18 మే 2017 (17:22 IST)
గారెల కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. క్షణికావేశంతో జరిగే హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. భావోద్వేగాలకు లోనై.. దారుణాలకు పాల్పడే ఘటనలు దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా గారెలు రుచిగా లేవనే చిన్న కారణంతో హోటల్ యజమానిని ఓ యువకుడు గొంతుకోసి చంపేసిన ఘటన కేరళలోని మంగళప్పిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల రతీష్ అనే ట్యాక్సీ డ్రైవర్.. జాన్సన్ నడుపుతున్న హోటల్‌కు వెళ్లాడు. ఆ హోటల్‌లో గారెలు ఆర్డర్ చేశాడు. ఫుల్‌గా లాగించేశాడు. ఆపై వడలు రుచిగా లేవని జాన్సన్‌తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. దీంతో కస్టమర్లకు ఇబ్బందిగా ఉందని.. ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందిగా జాన్సన్ రతీష్‌ను హోటల్‌ నుంచి గెంటేశాడు. 
 
బయటకు వెళ్లిన రతీష్.. ఫూటుగా తాగి.. బైకుపై వెళ్తున్న జాన్సన్‌ను అడ్డుకుని గొంతుకోసి పారిపోయాడు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాన్సన్ మరణించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రతీష్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments