Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో బుల్లెట్ రైలు... 14న శంకుస్థాపన

భారత్‌లో బుల్లెట్ రైలు పరుగు పెట్టనుంది. ఇందుకోసం సెప్టెంబరు 14వ తేదీన శుంకుస్థాపన చేయనున్నారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య నడుపనున్నారు. అయితే, ఈ బుల్లెట్ రైలు ప్రయాణం 2023 నా

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (06:27 IST)
భారత్‌లో బుల్లెట్ రైలు పరుగు పెట్టనుంది. ఇందుకోసం సెప్టెంబరు 14వ తేదీన శుంకుస్థాపన చేయనున్నారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య నడుపనున్నారు. అయితే, ఈ బుల్లెట్ రైలు ప్రయాణం 2023 నాటికి అందుబాటులోకి రానుంది. ఈ రైలు గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళ్లనుంది. దీనిద్వారా ముంబై నుంచి అహ్మదాబాద్‌(508 కి.మీ)కు రెండు గంటల్లో చేరుకోవచ్చు. 
 
కాగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం సెప్టెంబరు 14వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతీ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జపాన్ ప్రధాని షింజో అబే కూడా పాల్గొననున్నారు. సుమారు రూ.98,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు వ్యయంలో 81 శాతాన్ని జపాన్‌ రుణంగా సమకూర్చనుంది. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా ఇరుదేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం సెప్టెంబర్‌ 13న గుజరాత్‌కు మోడీ, అబేలు చేరుకుంటారు. ఈ సందర్భంగా వీరిద్దరు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments