Webdunia - Bharat's app for daily news and videos

Install App

PMGKAY పథకం కింద నవంబర్ వరకు ఉచిత రేషన్

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (20:27 IST)
ration
ప్రధాన్ మంత్రి గరీభ్​ కల్యాణ్​​ యోజన (PMGKAY) పథకం కింద నవంబర్ వరకు ఉచిత రేషన్​ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 80 కోట్ల మందికి మరో 5 నెలల పాటు ఉచితంగా రేషన్​ అందనుంది. 
 
కరోనా సమయంలో పేదలు ఇబ్బంది పడకుండా ఉచిత రేషన్​ సౌలభ్యాన్ని పొడిగించటం వరుసగా ఇది నాలుగోసారి. గతేడాది లాక్​డౌన్ దృష్ట్యా గరీభ్ కల్యాణ్​ అన్న యోజన ద్వారా పేదలకు 8 నెలలు ఉచిత రేషన్​ అందించారు. కరోనా సెకండ్ వేవ్​లో ఈ ఏడాది మే, జూన్​ వరకు అమలు చేశారు. కరోనా పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడకుండా ప్రస్తుతం మరో ఐదు నెలలు పొడిగించారు. 
 
లబ్దిదారులైన ప్రతి వ్యక్తికి రేషన్ షాపుల ద్వారా 5 కేజీల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వనున్నారు. దీని కోసం కేంద్రానికి రూ.64,031కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఐదు నెలలకుగాను సుమారు 204 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నారు.
 
కాగా, ఈ నెల ప్రారంభంలో జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ..దీపావళి వరకు పేదలకు ఉచిత రేషన్​ అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు ఇవాళ (జూన్-23,2021) మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments