Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవై ఆస్పత్రిలో వృద్ధురాలి మృతదేహాన్ని కొరికి తిన్న పిల్లి.. వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (13:17 IST)
కోయంబత్తూరులో దారుణం చోటుచేసుకుంది. కోవై ప్రభుత్వాసుపత్రిలో ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పిల్లి కొరికి తినింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కోవై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఓ వృద్ధురాలు సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని ఎవరూ తీసుకునేందుకు రాని కారణంగా.. ఆస్పత్రి సిబ్బంది మార్చురీలో వుంచకుండా.. వార్డులోనే వదిలిపెట్టేశారు. 
 
ఈ నేపథ్యంలో ఓ పిల్లి వృద్ధురాలి మృతదేహాన్ని కొరికి తింది. దీనిపై కొందరు యువకులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీసినా వారి నుంచి నిర్లక్ష్యంగా బదులు వచ్చింది. దీంతో ఆగ్రహించిన యువకులు వృద్ధురాలి మృతదేహాన్ని పిల్లి కొరికి తిన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 
 
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఆ మృతదేహాన్ని మార్చురీలోకి తీసుకెళ్లారు. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments