Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ, తెలంగాణాలకు "స్థానిక" నిధుల విడుదల... ఏపీకి రూ.948 కోట్లు

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (14:36 IST)
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. స్థానిక సంస్థలకు కేటాయించాల్సిన నిధులను విడుదల చేసింది. ఆ ప్రకారంగా ఏపీకి రూ.948 కోట్లు, తెలంగాణాకు రూ.273 కోట్లు చొప్పున కేటాయించింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.15,705 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల్లో అత్యధికంగా బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,733 కోట్లు కేటాయించింది. ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఈ నిధులు కేటాయిస్తుంటారు. ఇందులోభాగంగా, రూ.15,705.65 కోట్లను ఒకేసారి విడుదల చేసింది. 
 
అదేసమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తర్వాత అత్యధికంగా బీహార్ రాష్ట్రానికి రూ.1,921 కేటాయించగా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు రూ.వెయ్యికోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాలకు రూ.వెయ్యి కోట్లు లోపు మాత్రమే కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments