Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో దారుణం... ప్రియురాలి సజీవదహనం

Webdunia
ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (11:45 IST)
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనతో సహజీవనం చేస్తున్న మహిళ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో ఆమెను ముత్తు అనే వ్యక్తి బస్టాండ్‌లోనే సజీవ దహనం చేశాడు. చెన్నైలో రోజువారీ కార్మికుడైన ముత్తు.. శాంతి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వారిద్దరు బస్‌స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపైనే జీవించేవారు. 
 
అయితే కోయంబేడు మార్కెట్‌లో పనిచేసే మరో వ్యక్తితో శాంతి సన్నిహితంగా ఉంటోంది. అది ఇష్టంలేని ముత్తు సదరు వ్యక్తితో తెగదెంపులు చేసుకోవాలని శాంతిని హెచ్చరించాడు. 
 
ఆమె వినకపోవడంతో కక్ష పెంచుకున్న ముత్తు.. శాంతి నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్‌ పోసి ఆమెకు నిప్పంటించాడు. అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రయాణికులు, స్థానికులు ఆ మంటలను ఆర్పేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఇరువురిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments