Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డనే రూ.10లక్షలకు అమ్మేసిన తల్లిదండ్రులు..!

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (12:18 IST)
కన్నబిడ్డనే తల్లిదండ్రులు అమ్మకానికి పెట్టాడు. చెన్నైకి చెందిన బిజినెస్ మ్యాన్ కు తమ పదేళ్ల కూతురును రూ.10 లక్షలకు అమ్మిన తల్లిదండ్రులను సేలం పోలీసులు అరెస్టు చేశారు. ఆ బాలికను దత్తత తీసుకోకుండా అక్రమ పద్ధతుల్లో కొనుగోలు చేసిన పారిశ్రామికవేత్తను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సేలం అన్నాదానపట్టిలో సతీష్‌కుమార్‌(30), సుమతి (26) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమార్తె ఉంది. 
 
సుమతి కొన్నేళ్ల క్రితం చెన్నైలో ఎక్స్‌పోర్ట్‌ కంపెనీ యజమాని కృష్ణన్‌ ఇంటిలో పనిమనిషిగా వుండేది. ఆ తర్వాత ఆమె స్వస్థలానికి తిరిగి వెళ్లింది. ఆ తర్వాత కృష్ణన్‌ మనస్పర్థల కారణంగా భార్యను విడిచిపెట్టి ఒంటరిగా గడుపుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా సుమతి తన కుమార్తెను రూ.10 లక్షలకు కృష్ణన్‌కు అమ్మేసింది. అయితే సుమతి తల్లి చిన్నపొన్ను ఈ విషయాన్ని పసిగట్టింది. కొద్ది రోజులుగా తన మనమరాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరపడంతో అసలు గుట్టు రట్టయ్యింది. బాలికను అమ్మిన సుమతి, సతీష్‌కుమార్‌ను, పారిశ్రామికవేత్త కృష్ణన్‌ను పోలీసులు అరెస్టుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments