Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిలో దోశె పిండి కొనుగోలు చేస్తే ఒక బిందె నీరు ఉచితం!

Webdunia
సోమవారం, 1 జులై 2019 (11:13 IST)
చెన్నై మహానగరంలో తీవ్రమైన నీటీ ఎద్దడి నెలకొంది. తాగేందుకు కూడా బిందెడు నీటి కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రేయింబవుళ్లు శ్రమిస్తోంది. ఇందుకోసం పొరుగు జిల్లాల నుంచి కూడా నీటిని తరలించే చర్యలను చేపట్టనుంది. 
 
ఈ క్రమంలో చెన్నై నగరానికి చెందిన ఓ వ్యాపారికి వినూత్న ఆలోచన ఒకటి వచ్చింది. తన దుకాణంలో కిలో దోశె పిండి కొనుగోలు చేస్తే ఒక బిందెనీరు ఉచితం అంటూ ఓ ప్రకటన బోర్డును ఏర్పాటు చేశాడు. తద్వారా నీటి సమస్యతో బాధపడేవారికి నీటిని ఇవ్వడంతో పాటు... తన వ్యాపారాన్ని కూడా రెట్టింపు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావించాడు. ఈ ఫ్లెక్సీ ఇపుడు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.
 
ఈ ప్రకటన బోర్డుతో ఇప్పుడతని దుకాణం కస్టమర్లతో కిటకిటలాడుతోంది. తాను 24 సంవత్సరాలుగా ఈ దుకాణం సాగుతున్నానని, నీరు ఉచితమన్న తరువాత అమ్మకాలు బాగా పెరిగాయని దుకాణం యజమాని అంటున్నారు. ఈ ఒక్క సంఘటనే చెన్నై నగరంలో నెలకొన్న నీటి ఎద్దడి తీవ్రతను కళ్లకు కడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments