Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధాన్ని నిలదీసినందుకు భర్తను తుపాకీతో కాల్చిన భార్య

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (11:45 IST)
అక్రమ సంబంధాలు భార్యాభర్తల మధ్య కార్చిచ్చులు రేపుతున్నాయి. ఇటీవల భార్యాభర్తలు కలిసి ఉండటం కల్లగా మారింది. విడాకులు తీసుకోవడం నుండి హత్యలు చేయడం వరకూ దారితీస్తున్నాయి. అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావని నిలదీసినందుకు భర్తను తుపాకీతో కాల్చేపారిసేందో భార్య. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రానికి చెందిన సునీత మింజ్ (39) అనే మహిళ భతాపారా రైల్వే స్టేషన్‌లో ఆర్‌పిఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. అతని భర్త దీపక్ శ్రీవాస్తవ (42) కూడా రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావని నిలదీశాడు. 
 
ఈ విషయంలో వారిద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవపడ్డారు. అది ఇద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లింది. కోపావేశంతో భార్య తన సర్వీస్ రివాల్వర్ తీసి దీపక్‌ని కాల్చింది. గాలిలో రెండు సార్లు కాల్పులు జరిపి ఆ తర్వాత అతని తొడపై కాల్చింది. ఇప్పుడు అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు హత్యాయత్నం క్రింద ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments