Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవై కారు బాంబు పేలుడు.. తమిళనాడులో ఎన్.ఐ.ఏ సోదాలు

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (13:25 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఇటీవల జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా, గురువారం ఎన్.ఐ.ఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 40 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
గత నెల 23వ తేదీన కోయంబత్తూరు నగరంలో కారు బాంబు పేలుడు సంభవించింది. మారుతి 800 కారులో ఎల్పీజీ సిలిండర్‌ పేలుడు సంభవించింది. కొట్టాయ్ ఈశ్వర్ ఆలయం ముందు భాగంలో ఈ పేలుడు జరిగి జమేజా ముబిన్ అనే వ్యక్తి మరణించాడు. 
దీనిపై ఎన్.ఐ.ఏ కౌంటర్ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్సో విభాగం దర్యాప్తు చేస్తోంది. 
 
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, తమిళనాడు పోలీసులు త్వరితగతిన స్పందించి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిని చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని పుదుపేట, మన్నాడు, జమాలియా, పెరంబూరు, కోయంబత్తూరులోని కొట్టైమేడు, ఉక్కడంతో సహా మొత్తం 40 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments