Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా విజృంభణ

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (20:13 IST)
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతోంది. ఈ క్రమంలో వార్ధా జిల్లా యంత్రాంగం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం వల్ల జిల్లా యంత్రాంగం 60 గంటల పాటు లాక్‌డౌన్‌ విధించింది.

శనివారం ఉదయం 8 గంటల నుంచి 60 గంటలపాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుందని ఆ జిల్లా కలెక్టర్‌ ప్రేర్నా పేట్రియాట్‌ తెలిపారు. ఈ సమయంలో నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా.. దుకాణాలు, మెడికల్‌షాపులు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.2 వేల జరిమానా విధించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఆ జిల్లాలో గురువారం ఒక్కరోజే.. 251 మంది వైరస్‌ బారినపడగా.. నలుగురు మరణించారు. ముఖ్యంగా హోలీ పండుగ దృష్ట్యా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వరుసగా జిల్లాల్లో నాలుగోరోజు కూడా 500కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు. కాగా, ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు పూర్తి లాక్‌డౌన్‌ విధించగా.. తర్వాత కొంత సడలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments