Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో 470 మంది చిన్నారులకు కరోనా

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (03:49 IST)
కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి మరోమారు చెలరేగిపోతోంది. ఈ నెల మొదటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 470 మంది చిన్నారులు కరోనా బారినపడ్డారు. వీరంతా పదేళ్లలోపు వారే కావడం గమనార్హం.

ఈ నెల 1 నుంచి 26 మధ్య 244 మంది అబ్బాయిలు, 228 మంది బాలికలు మహమ్మారి బారినపడినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయ్. గతంలో రోజుకు 8-9 మంది చిన్నారులు వైరస్ బారినపడే వారు. ఇప్పుడా సంఖ్య 46కు పెరిగింది.
 
గతంలో కాకుండా ఇప్పుడు చిన్నారులకు కూడా వైరస్ సంక్రమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఇప్పుడు బయటకు వస్తున్నారని, వేడుకలకు హాజరవుతున్నారని, దీనికి తోడు స్కూల్స్ కూడా తిరిగి తెరుచుకోవడంతోనే వారు ఎక్కువగా దాని బారినపడుతున్నారని చెబుతున్నారు.

కానీ గతంలో లాక్‌డౌన్ కారణంగా చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారని, వైరస్ నుంచి వారిని అదే దూరంగా ఉంచిందని పేర్కొన్నారు.

కాబట్టి స్కూళ్లు మూసివేయాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ కోర్స్ ఎపిడెమాలజీ ప్రొఫెసర్, హెడ్ డాక్టర్ గిరిధర ఆర్ బాబు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments