Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకాక్ నుంచి దిల్లీకి స్పైస్ జెట్‌లో కరోనా(కొవిడ్-19) వైరెస్‌తో వచ్చిన ప్రయాణికుడు...

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (18:46 IST)
చైనాలో వేల సంఖ్యలో బలి తీసుకుంటున్న కరోనా వైరస్ (కొవిడ్ -19) ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. విదేశాల నుంచి విమానాల్లో కానీ నౌకల ద్వారా గానీ ఎవరన్నా వస్తున్నారంటే చచ్చేంత భయమేస్తోంది. వచ్చినవారిని తనిఖీలు చేస్తుంటే కొవిడ్-19 తో బాధపడేవారు కనీసం ఇద్దరుముగ్గురు తేలుతున్నారు. దీనితో భారతదేశం అప్రమత్తమయ్యింది. 
 
తాజాగా బ్యాంకాక్ నుంచి దిల్లీకి స్పైస్ జెట్లో వచ్చిన ఓ ప్రయాణికుడికి కొవిడ్-19 వున్నట్లు తేలింది. అతడు స్పైస్ జెట్ ఎస్జీ 88లో 31వ నెంబర్ సీటులో కూర్చుని వచ్చాడు. దీనితో అతడి ప్రక్కనే మరెవరైనా కూర్చుని వచ్చారేమోనని చెక్ చేయగా ఎవరూ రాలేదని తేలింది. 
 
కాగా కొవిడ్ అనుమానితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి పర్యవేక్షణలో వుంచారు. అంతేకాదు... బ్యాంకాక్ నుంచి కోల్ కతాకు వచ్చిన విమానంలో మరో ఇద్దరికి కొవిడ్ సోకిందని పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. దీనితో మన దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాలో ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 1300 మందికి పైగా మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments