Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర మంత్రికి కరోనా

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (19:11 IST)
కరోనా వైరస్ కేసుల్లో దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉన్న మహారాష్ట్రలో తాజాగా మరో మంత్రికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండేతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఇద్దరు డ్రైవర్లు, కుక్ తో సహా ఐదుగురు సిబ్బందికి వైరస్ సోకిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం ప్రకటించారు.

అంతకుముందు రోజు జరిగిన కేబినెట్ భేటీలో ధనుంజయ్ పాల్గొన్నారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో ఆందోళన మొదలైంది. ఇంతకుముందే ఇద్దరు మంత్రులు జితేంద్ర అవద్(ఎన్సీపీ), అశోక్ చవాన్(కాంగ్రెస్)​లకు కరోనా సోకింది.

అయితే వీరిద్దరు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వీరిద్దరికీ ఏప్రిల్ 13న వారి సెక్యూరిటీ సిబ్బంది ద్వారా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 94,041 కేసులు నమోదు కాగా.. 3,438 మంది వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. 44,517 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments