Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత వేలిముద్ర ఇష్యూ- లక్కానీకి సమన్లు.. అపోలో వ్యవహారం బయటపడుతుందా?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్ర వ్యవహారంలో ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లక్కానీకి హైకోర్టు సమన్లు జారీ చేసింది. తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం ఎమ్మెల్యే బోస్ గెలుపును వ్యతిరేకిస్తూ డీఎంకే అభ్యర్థి

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (10:35 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్ర వ్యవహారంలో ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లక్కానీకి హైకోర్టు సమన్లు జారీ చేసింది. తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం ఎమ్మెల్యే బోస్ గెలుపును వ్యతిరేకిస్తూ డీఎంకే అభ్యర్థి పెట్టిన కేసులో రాజేష్ లక్కానీ జోక్యం చేసుకుని జయలలిత వేలిముద్రలకు సంబంధించిన అంశంపై సరైన ఆధారాలను ఈ నెల 24వ తేదీలోపు సమర్పించాల్సిందిగా చెన్నై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. తిరుప్పరంకుండ్రం నియోజకవర్గం ఎమ్మెల్యే గెలుపొందిన అన్నాడీఎంకే శీనివేలు శాసనసభ అభ్యర్థిగా బాధ్యతలు చేపట్టకముందే అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ నియోజకవర్గానికి శీనివేలు మృతితో ఉపఎన్నికలు జరిగే సమయానికి జయలలిత ఆస్పత్రిలో వున్నారు. ఆ సమయంలో పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి చిహ్నం కేటాయించేందుకు పార్టీ అధినేత్రి, సంతకం పెట్టాల్సి వుంటుంది.  
 
కానీ ఆ సమయంలో అమ్మ సంతకం చేయలేని స్థితిలో ఆస్పత్రిలో ఉండగా, సంతకానికి బదులు ఎన్నికల సంఘం అనుమతితో వేలిముద్రలు తీసుకోవడం జరిగింది. దీంతో రెండాకుల చిహ్నాన్ని బోస్‌కు ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ చిహ్నంపై బోస్ గెలుపొందారు. కానీ బోస్ గెలుపుకు వ్యతిరేకంగా డీఎంకే అభ్యర్థి శరవణన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
ఈ పిటిషన్‌లో జయలలిత వేలిముద్రలను అక్రమంగా పొందినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లక్కానీ కోర్టులో హాజరై.. బోస్ ఎన్నికల నామినేషన్, జయలలిత వేలిముద్రలతో పాటు 22 ఆధారాలను సమర్పించాలని కోర్టు వెల్లడించింది. కాగా 24న కోర్టులో ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లక్కానీ సమర్పించే ఆధారాల్లో అపోలో వ్యవహారం ఏదైనా బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా జయలలిత మరణం గురించి ఏదైనా విషయాలు వెలువడే ఆస్కారం ఉన్నట్లు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments