Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేటర్ చెన్నై పరిధిలో లాక్డౌన్.. కఠిన ఆంక్షలతో 19 నుంచి అమలు!

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (16:26 IST)
దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజధాని చెన్నైలో ఈ కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీంతో ఈ నెల 19వ తేదీ నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కంప్లీట్ లాక్డౌన్ ఈ నెల 19వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇది గ్రేటర్ చెన్నై పరిధిలోకి వచ్చే చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలుకానుంది. 
 
ఈ లాక్డౌన్ సమయంలో ఆటోలు, టాక్సీలు, ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. ఎమర్జెన్సీ అయితే, మినహా ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. లాక్డౌన్ విధిస్తున్న ఈ నాలుగు జిల్లాల్లో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని తమిళనాడు ప్రభుత్వం సర్కారు నిర్ణయించింది. అలాగే, ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని రకాల సడలింపులను రద్దు చేయనున్నారు. 
 
కిరాణా సరకుల, కూరగాయల దుకాణాలు మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరిచివుంచనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా, ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో 42,607 మందికి కరోనా సోకింది. 23409 మంది కోలుకున్నారు. 397 మంది చనిపోయారు. గ్రేటర్ చెన్నై పరిధిలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments