Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో లిక్కర్ స్కామ్ : నెల్లూరులో ఈడీ సోదాలు

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (11:22 IST)
ఇటీవల ఢిల్లీ రాజకీయాలను మద్యం కుంభకోణం కుదిపేసింది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరుపుతుంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు పలువురు ఇళ్లలో సోదాలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన హైదరాబాద్, నెల్లూరులతో పాటు ఏకంగా 40 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 
 
ఒక్క హైదరాబాద్ నగరంలోనే 20కు పైగా ప్రాంతాల్లోను, ఏపీలోని నెల్లూరు, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో మరో 20 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. లిక్కర్ బిజినెస్ వ్యాపారులు, డిస్టిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్‌వర్క్‌ను ఈడీ అధికారులు టార్గెట్ చేశారు. 
 
కాగా, ఈ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు సోదాలు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతవారం ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. అపుడు ఏపీలో సోదాలు నిర్వహించని ఈడీ అధికారులు రెండో దఫాలో మాత్రం ఈ తనిఖీలు చేస్తుండటం గమనార్హం. కాగా, ఈ కేసును సీబీఐ కూడా విచారిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments