Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల అఫిడవిట్‌లో అసత్యాలు.. ఈసీని తప్పుదోవ పట్టించిన అమిత్ షా

Webdunia
ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (10:07 IST)
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చిక్కుల్లో పడ్డారు. ఆయన సమర్పించిన నామినేషన్ అఫిడవిట్‌లో అసత్యాలు పేర్కొన్నట్టు సమాచారం. ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని సైతం తప్పుదారి పట్టించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. 
 
ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో అమిత్‌ షా తప్పుడు వివరాలు పొందుపరిచారని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని తన ఫిర్యాదులో కోరింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.66.7 లక్షల విలువ ఉన్న ఆస్తిని అమిత్ షా తన అఫిడవిట్‌లో రూ.25లక్షలుగా పేర్కొన్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. 
 
అలాగే, గాంధీనగర్‌లో ఒక ప్లాట్, ఓ కమర్షియల్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి అమిత్ షా అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచినట్టు పేర్కొంది. షా తన కుమారుడి బిజినెస్ కోసం రెండు ప్రాపర్టీలను కమర్షియల్ బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.25 కోట్లు రుణం పొందారని.. ఆ వివరాలను కూడా అఫిడవిట్‌లో తప్పుగా పొందుపరిచారని పేర్కొంది. దీంతో అమిత్ షా సమర్పించిన అఫిడవిట్‌ను ఈసీ మరోమారు పరిశీలించనుందనే వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments