Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడిగా వున్న తారును బతికున్న కుక్కపై పోసేశారు.. చివరికి?

మానవత్వం మంటగలిసిపోతోంది. వేడిగా ఉన్న తారును బతికున్న శునకంపై వేసి రోడ్డేసిన దారుణ ఘటన ఆగ్రాలోని ఫతేబాద్‌లో చోటుచేసుకుంది. వేడి వేడి తారు మీద పడటంతో ఎంతో బాధతో విలవిలలాడుతున్నప్పటికీ.. రోడ్డు వర్కర్లు

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (16:54 IST)
మానవత్వం మంటగలిసిపోతోంది. వేడిగా ఉన్న తారును బతికున్న శునకంపై వేసి రోడ్డేసిన దారుణ ఘటన ఆగ్రాలోని ఫతేబాద్‌లో చోటుచేసుకుంది. వేడి వేడి తారు మీద పడటంతో ఎంతో బాధతో విలవిలలాడుతున్నప్పటికీ.. రోడ్డు వర్కర్లు ఏమాత్రం కనికరం చూపలేదు.
 
చివరికి ఆ శునకం మృతి చెందింది. బతికున్న శునకంపైనే తారుపోస్తున్నారని స్థానికులు చెప్తున్నా.. కన్‌స్ట్రక్షన్ వర్కర్లు పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. అయితే మంగళవారం రాత్రి చీకటిలో రోడ్డు నిర్మాణం జరిగిందని.. రోడ్డు పక్కన ఉన్న కుక్కను వర్కర్లు గమనించకపోయి వుండవచ్చునని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే దీనిపై జంతు సంరక్షణ అధికారులు మండిపడుతున్నారు. కొత్తగా వేసిన రోడ్డు పక్కనే శునకపు కాళ్లు వుండిపోయాయని.. కాసేపు బాధతో విలవిల్లాడిన శునకం ఆపై ప్రాణాలు కోల్పోయిందని గోవింద పరాషర్ అనే సామాజిక కార్యకర్త అన్నారు. కానీ ఉదయానికల్లా కుక్క శవం కనిపించలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments