Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరకట్నం వేధింపులతో భార్య ఆత్మహత్య.. భర్త జైలుకు.. పోలీసులే అత్తకు వైద్యం ఇప్పించారు..

వరకట్న మృతి కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు, దోషి అయిన భర్తను జైలుకు పంపించిన కేసులో... వయసు మళ్లి పక్షవాతంతో బాధపడుతున్న ఓ తల్లిని చూసుకునే బాధ్యతలను కోర్టు ఢిల్లీ పోలీసులకు అప్ప

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (18:41 IST)
వరకట్న మృతి కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు, దోషి అయిన భర్తను జైలుకు పంపించిన కేసులో... వయసు మళ్లి పక్షవాతంతో బాధపడుతున్న ఓ తల్లిని చూసుకునే బాధ్యతలను కోర్టు ఢిల్లీ పోలీసులకు అప్పగించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ, పితాంపురాకు చెందిన ఓ వ్యక్తికి 2013 ఫిబ్రవరిలో ఓ మహిళతో వివాహమైంది. 
 
ఇది వీరిద్దరికీ రెండో పెళ్లి.. భర్త తల్లి అనారోగ్యంతో ఆస్పత్రి పాలవడంతో వైద్య ఖర్చుల కోసం పుట్టింటి నుంచి డబ్బులు తెమ్మని భార్యను వేధించాడు. పలుసార్లు తన పుట్టింటివారితో ఈ విషయం చెప్పి వాపోయినా వారు పట్టించుకోకపోవడంతో.. 2013 జూన్ 2న అత్తవారింట్లో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరకట్న మృతిగా నమోదైన ఈ కేసులో నిందితుడైన భర్తకు ఢిల్లీ కోర్టు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. 
 
అదే సమయంలో పక్షవాతంతో బాధపడుతున్న నిందితుడి తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. వృద్ధురాలి బాగోగోలపై ఢిల్లీ పోలీసులదే బాధ్యత అంటూ ఆదేశాలు చేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఆ వృద్ధురాలిని వృద్ధాశ్రమంలో చేర్పించి.. సరైన వైద్యం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments