Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతకు ఇసి నోటీసులు

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:50 IST)
పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రంజుగా మారుతోంది. ఎనిమిది దశల పోలింగ్‌లో భాగంగా ఇప్పటికే అక్కడ మూడు దశలు ముగియగా... మరో ఐదు దశల పోలింగ్‌ జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార తృణమూల్‌, బిజెపిలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో పాటు... పోటాపోటీగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.

మూడో దశ ఎన్నికల ప్రచారంలో ఓ మతాన్ని ప్రస్తావిస్తూ ఓట్లు అడిగారన్న ఆరోపణలపై బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ఇసి నోటీసులు జారీ చేసింది.

ముస్లింలు ఓట్లు చీలిపోయేలా వేర్వేరు పార్టీలకు ఓటు వేయవద్దని, గంపగుత్తగా తమ పార్టీకే వేయాలని మమతా ఓటర్లను అభ్యర్థించారని బిజెపి నేత, కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి ఇసికి ఫిర్యాదు చేశారు.

దీనిపై మోడీ కూడా స్పందిస్తూ... ఆమెలా మేము కూడా తమ హిందువులకే పిలుపునిస్తే... ఇసి ఊరుకుంటుందా... అంటూ బెంగాల్‌ ప్రచార సభల్లో వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే మమతకు ఇసి నుండి నోటీసు అందింది. దీనికి 48 గంటల్లోగా బదులివ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments