Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సైనికుడిగా నా రక్తం మరిగిపోతోంది : వీకే సింగ్

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (12:13 IST)
ఒక దేశ మాజీ సైనికుడిగా నాలోని రక్తం మరిగిపోతోందని భారత ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ అన్నారు. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిపై వీకే సింగ్ స్పందించారు. 
 
ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ఆయన సంతాపం వ్యక్తంచేశారు. ఈ ఘటనను ఉగ్రవాదుల పిరికి చర్యలా అభివర్ణించారు. ఓ పౌరుడిగా, సైనికుడిగా ఉగ్రవాదుల దురాగతాన్ని తలచుకుంటుంటే తన రక్తం మరిగిపోతోందని, ప్రతి రక్తపు బొట్టుకు ఉగ్రవాదులు ప్రతిఫలాన్ని అనుభవిస్తారని హెచ్చరించారు. జవాన్ల త్యాగాలకు 'సెల్యూట్' చేస్తున్నానని వీకే సింగ్ అన్నారు. 
 
మరోవైపు ఈ దాడిపై సీఆర్పీఎఫ్ డీజీ భట్నాగర్ మాట్లాడుతూ, పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఘటనా స్థలికి ఉన్నతాధికారులు వెళ్లారని, గాయపడ్డ జవాన్లను ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళుతున్న సీఆర్పీఎఫ్‌కి చెందిన 78 వాహనాల శ్రేణిలో 2500 మంది జవాన్లు ఉన్నారని చెప్పారు. సెలవుల అనంతరం విధులకు హాజరయ్యేందుకు వారు వెళ్తుండగా ఈ దారుణం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments