Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మహత్య చేసుకున్న హర్యానా మాజీ ముఖ్యమంత్రి కుమారుడు

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (11:06 IST)
హర్యానా మాజీ ముఖ్యమంత్రి మాంగేరాయ్ రాఠీ కుమారుడు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీతో సహా ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. 55 సంవత్సరాల జగదీశ్ రాఠీ బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్టు ఝజ్జర్ ఎస్పీ వసీం అక్రమ్ తెలిపారు.
 
శవపరీక్ష తర్వాత ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఆయన విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమికంగా తెలియవచ్చిందన్నారు. ఆస్తి సంబంధ విషయాల్లో జగదీశ్ వేధింపులు ఎదుర్కొన్నట్టు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన తీవ్ర ఒత్తిడిలో కూరుకుని పోయినట్టు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని జగదీశ్ కూడా ఇటీవల ఓ ఆడియో క్లిప్ ద్వారా వెల్లడించారు. 
 
కాగా, డిసెంబరు 26వ తేదీన ఓ ఆడియో క్లిప్ విడుద చేస్తూ వీరందరూ తనను వేధిస్తున్నారని తనకేమైనా జరిగితే అందుకు వారే బాధ్యులు అవుతారని అందులో ఆరోపించారు. దీంతో పోలీసులు ఆయనను కలిసి ఫిర్యాదు చేయాలని కోరగా అందుకు ఆయన నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments