Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుకలకు పెట్టిన మందు తిని 12 నెమళ్లు మృతి

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (11:48 IST)
తమిళనాడు రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. ఎలుకలను చంపేందుకు పెట్టిన మందు తిని 12 నెమళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటనకు కారణమైన రైతుని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని నాచ్చియార్ కుప్పం అనే ప్రాంతంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన షణ్ముగం (75) అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం ఓ మహిళకు చెందిన భూమిని కౌలుకు తీసుుకుని సాగు చేశాడు. 
 
అయితే, ఈ సాగు చేతికొచ్చే సమయంలో ఎలుకలు, నెమళ్లు ధ్వంసం చేయడాన్ని గమనించారు. దీంతో ఎలుకలను చంపేందుకు పొలంలో మందు పెట్టాడు. ఈ మందును నెమళ్లు ఆరగించాయి. దీంతో అవి ప్రాణాలు కోల్పోయాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... చనిపోయిన నెమళ్ళను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రైతును అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments