ఆస్పత్రికి ట్రీట్మెంట్‌ కోసం పాముతో వెళ్లిన రైతన్న..

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:17 IST)
ఓ రైతన్న ఆస్పత్రికి వెళ్తూ వెళ్తూ నాగుపామును తనతో తీసుకెళ్లాడు. ఆ వృద్ధుడి చాకచక్యాన్ని ప్రస్తుతం నెటిజన్లు కొనియాడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని చిన్నకండియన్‌కుప్పంకు చెందిన రంగనాథన్ అనే వృద్ధుడు.. తన తోటలో పనిచేస్తుండగా.. ఓ నాగుపాము ఆయన కాలిపై కాటేసింది. 
 
అయితే ఆ పాముకాటును పెద్దగా లెక్కచేయని ఆ వృద్ధుడు.. నొప్పిని తట్టుకుని వెంటనే ఓ గోనె సంచిలో ఆ పామును పట్టుకున్నాడు. ఆపై నాగుపాముతో కూడిన గోనెసంచిని తనతో వెంటబెట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. 
 
అయితే ఆ సంచిలోని రెండున్నర అడుగుల నాగుపామును చూసి రోగులు పరుగులు తీశారు. దీనిపై వైద్యులు వృద్ధుడి వద్ద ఆరా తీస్తే.. తన కాలిపై కాటేసిన పామును సంచిలో వేసుకుని తీసుకొచ్చానని చెప్పాడు. ఫలితంగా ఆ పాము విషాన్ని బట్టి వృద్ధుడికి వైద్యులు చికిత్స అందించారు. ఆపై ఆ పామును అటవీ శాఖా అధికారులు అందజేశారు. 
 
చికిత్స అనంతరం రైతు వృద్ధుడు రంగనాథన్ ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. ఏ పాము కరిచిందో తెలియక తికమకపడుతున్న వైద్యులకు కచ్చితమైన చికిత్స ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ పామును సంచిలో వేసుకొచ్చినట్లు వృద్ధుడు చెప్పాడు. అతని తెలివికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని మదం తో ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments