Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో వరద బీభత్సం సృష్టిస్తున్న వరదలు

Webdunia
సోమవారం, 16 మే 2022 (13:42 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అస్సాం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. మొత్తం ఆరు జిల్లాల్లో వరద నీరు పోటెత్తడంతో వందలాది గ్రామాలు నీట మునిగిపోయాయి. దాదాపు 24 వేల మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నట్టు అధికారులు చెపుతున్నారు. 
 
ఈ వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వరద ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కొన్ని జిల్లాల్లో దుకాణాలు, గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరద ధాటికి ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈ వరదలు అస్సాం రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. 
 
పలు జిల్లాల్లో వరద నీరు పొంగి పొర్లుతున్నాయి. వరద ధాటికి పలు ప్రాంతాల్లో రైలు కట్టలు దెబ్బతిన్నాయి. దీంతో అస్సాంకు వెళ్లే అనేక రైళ్లను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments