Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు భారత్ బంపర్ ఆఫర్.... ఉగ్రవాదుల ఏరివేతకు సైనికసాయం...

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (13:58 IST)
దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు అవసరమైన సైనిక సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదంపై పాకిస్థాన్ తన వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలన్నారు. లేనిపక్షంలో పాకిస్థాన్ ముక్కలు కాకతప్పదని ఆయన జోస్యం చెప్పారు. 
 
హర్యానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, 'నేను పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఒక సలహా ఇవ్వదలచుకున్నాను. మీరు నిజంగానే ఉగ్రవాదంపై పోరాడేందుకు సిద్ధమంటే మీకు మేము సహకరించేందుకు ముందుంటాం. ఒకవేళ మా సైనిక సహకారం కోరుకున్నా మేము వారిని పాకిస్థాన్‌ పంపించేందుకు సిద్ధమే' అని సభా ముఖంగా ప్రకటించారు. 
 
ఇప్పటికీ ఇమ్రాన్‌ పదేపదే కాశ్మీర్‌ గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి మరచిపోవాలని, మీరు ఎంత ఆలోచించినా ఏం జరగదన్నారు. మాపై ఎవరూ ఒత్తిడి తెచ్చినా తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. 1947లో మీరు భారత్‌ను రెండుగా విడగొట్టారు. ఆ తర్వాత 1971లో మీ దేశం రెండు ముక్కలైంది. ఇప్పుడు మళ్లీ సందర్భం వస్తే మీ దేశం విడిపోయే పరిణామాలను ఏ శక్తీ ఆపలేదని రాజ్‌నాథ్ జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments