Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా మాజీ క్రికెటర్ చంద్రశేఖర్ మృతి

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (08:47 IST)
టీమిండియా మాజీ క్రికెటర్ వీ.బీ చంద్రశేఖర్ గుండెపోటతో కన్నుమూశారు. తమిళనాడుకు చెందిన ఆయన భారత జట్టు తరపున కేవలం ఏడు మ్యాచ్‌లు ఆడి.. 53 పరుగులు చేశారు. జాతీయ జట్టులో అంతగా స్థానం లభించకపోయినా.. తమిళనాడు తరపున రంజీ  మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
 
దీనితో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కాంచీ వీరన్స్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. దానితో పాటు చెన్నైలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్రికెట్ అనే పేరుతో ఓ అకాడమీని ప్రారంభించారు.
 
ఈ నేపథ్యంలో గురువారం గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే  చంద్రశేఖర్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
 
 ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరోవైపు చంద్రశేఖర్ మృతిపట్ల మాజీ టీమిండియా కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీబీ దూకుడైన బ్యాట్స్‌మెన్.. భారత్ తరపున ఆయన ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోవడం దురదృష్టకరం. మేమిద్దరం కలిసి ఎన్నో సార్లు కామెంట్రీ కూడా చేశామని గుర్తు చేసుకున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments