Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక యువతి... ఆరుగురు మృగాళ్లు... ఏ విధంగా వేధిస్తున్నారో చూడండి (వీడియో)

బాలికల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టంలో కీలక సవరణలు చేసింది. 12 యేళ్ల బాలికలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణ దండన విధించేలా సవరణ చేశారు. అయినప్పటికీ.. కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. పైగా, ఈ

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (17:39 IST)
బాలికల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టంలో కీలక సవరణలు చేసింది. 12 యేళ్ల బాలికలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణ దండన విధించేలా సవరణ చేశారు. అయినప్పటికీ.. కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. పైగా, ఈ అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.
 
తాజాగా సోషల్ మీడియా వీడియో ద్వారా ఓ టీనేజ్ అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బీహార్‌లోని జెహనాబాద్‌లో జరిగింది. నడి రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ యువతిని ఆరుగురు మృగాళ్లు విరుచుకుపడ్డారు. తన బట్టలు విప్పుతూ పైశాచికానందాన్ని పొందారు. 
 
ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడే తప్ప వాళ్లను నిలువరించలేదు. ఆ అమ్మాయి వాళ్లతో పోరాడి ఓడింది. నడిరోడ్డు మీదే ఆ అమ్మాయి బట్టలు విప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియో చివరకు పోలీసులకు చేరడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ మృగాళ్ల వేటలో పడ్డారు. అమ్మాయిపై అటాక్ చేసిన వ్యక్తుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments