Webdunia - Bharat's app for daily news and videos

Install App

మడ్ బాత్ మసాజ్ పేరుతో మభ్యపెట్టి.. భర్త ఎదుటే బ్రిటన్ మహిళపై అఘాయిత్యం

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (09:59 IST)
గోవాలో బ్రిటన్‌కు చెందిన మహిళపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. గోవా సముద్ర పర్యాటక అందాలు తిలకించేందుకు వచ్చిన బ్రిటన్‌ మహిళను శరీర మర్దన చేసే నెపంతో స్థానిక యువకుడు ఒకరు ఆమె ప్రియుడి ముందే అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఉత్తర గోవా జిల్లాలోని అరంబోల్‌ బీచ్‌ వద్ద విన్సెంట్‌ సహా మరికొందరు అనుమతి లేకుండా మసాజ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యవయస్కురాలైన బ్రిటిష్‌ మహిళ తన భర్తతో కలసి ఈ నెల 2న బీచ్‌ సమీపంలోని స్వీట్‌ వాటర్‌ సరస్సు వద్దకు వచ్చింది. ఆ సమయంలో విన్సెంట్‌ మసాజ్‌ చేయించుకోవాలని కోరగా వారు అంగీకరించారు. 
 
ఆ తర్వాత బాధితురాలికి మర్దన చేస్తున్నట్లు నటిస్తూ ప్రియుడి ముందే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణాన్ని ఆ మహిళ బ్రిటన్‌లోని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. భారత్‌లోని బ్రిటిష్‌ ఎంబసీ సహాయాన్ని అర్థించింది. వారి సూచన మేరకు సోమవారం పెర్నెమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మసాజ్ పేరుతో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు విన్సెంట్‌ డిసౌజా(32)ను అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండుకు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments