ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని బులంద్షహర్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ ఆటగాడు, రాష్ట్ర ఛాంపియన్షిప్లలో బంగారు పతక విజేత అయిన 22 ఏళ్ల బ్రిజేష్ సోలంకి రేబిస్ వ్యాధితో దాదాపు రెండు నెలల తర్వాత మరణించాడు. మురుగు కుంటలో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతున్న ఓ కుక్కపిల్లను అతడు రక్షించే క్రమంలో దాని కాటుకు గురయ్యాడు. ఏముందిలే చిన్నకుక్కపిల్ల కాటు తనను ఏం చేస్తుంది అని అశ్రద్ధ చేసాడు. యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ తీసుకోలేదు. దీనితో అతని మరణానికి కొన్ని రోజుల ముందు లక్షణాలు కనిపించాయి.