Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై అక్రమంగా వాహనాన్ని పార్కింగ్ చేస్తే రూ.1000 ఫైన్.. నితిన్ గడ్కరీ

కేంద్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకోనుంది. రోడ్డుపై అక్రమంగా వాహనాన్ని పార్కింగ్ చేస్తే రూ. వెయ్యి అపరాధం విధించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (11:03 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకోనుంది. రోడ్డుపై అక్రమంగా వాహనాన్ని పార్కింగ్ చేస్తే రూ. వెయ్యి అపరాధం విధించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 
 
ప్రస్తుతం అక్రమంగా వాహనాన్ని పార్కింగ్ చేసిన వారి నుంచి రూ.200 మాత్రమే ఫైన్ వసూలు చేస్తున్నారు. దీన్ని వెయ్యి రూపాయలకు పెంచాలని భావిస్తున్నారు. స్మార్ట్ నాగ్‌పూర్ సిటీ సదస్సులో కేంద్రమంత్రి గడ్కరీ మాట్లాడుతూ అక్రమంగా వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేయకుండా నివారించేందుకు జరిమానాల పెంపు విధానాన్ని తీసుకురానున్నామన్నారు. 
 
రోడ్లపై అక్రమంగా పార్కింగ్ చేస్తే ఎవరైనా దాన్ని క్లిక్ మనిపించి ట్రాఫిక్ పోలీసు, రవాణాశాఖకు పంపించవచ్చునన్నారు. రోడ్లు ఆక్రమణకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. సరైన పార్కింగ్ సౌకర్యం లేకుండా భవనాల నిర్మాణానికి అనుమతి ఇవ్వవద్దని గడ్కరీ కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments