Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిచ్చగాళ్లు కూడా దేశం కోసం పని చేయాలి : బాంబే హైకోర్టు

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (09:43 IST)
బిచ్చగాళ్లు, నిరాశ్రయులు కూడా దేశం కోసం ప‌నిచేయాల‌ని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి వాళ్ళకు రాష్ట్ర ప్ర‌భుత్వమే అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేద‌ని ఓ కేసులో హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ మేరకు చీఫ్ జ‌స్టిస్ దీపాంక‌ర్ ద‌త్తా, జ‌స్టిస్ జీఎస్ కుల‌క‌ర్ణిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం వ్యాఖ్యలు చేసింది.
 
బ్రిజేశ్ ఆర్య అనే వ్యక్తి బిచ్చగాళ్ళ గురించి ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.అనాథ‌లు, బిచ్చ‌గాళ్ల‌కు మూడు పూట‌ల పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని, శుద్ద‌మైన తాగునీటి, క్లీన్ టాయిలెట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని కోరారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. ఎన్జీవోల సాయంతో అనాథ‌లు, బిచ్చ‌గాళ్ల‌కు ఆహార పొట్లాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కోర్టుకు చెప్పింది. మ‌హిళ‌ల‌కు శానిట‌రీ నాప్కిన్లు ఇస్తున్న‌ట్లు కూడా ఎంబీసీ కోర్టుకు తెలిపింది. 
 
ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం స్పందిస్తూ.. నిరాశ్ర‌యులు కూడా దేశం కోసం ప‌నిచేయాల‌ని, ప్ర‌తి ఒక్క‌రూ ప‌నిచేస్తున్నార‌ని, అన్నీ రాష్ట్ర ప్ర‌భుత్వమే ఇవ్వ‌ద‌ని, ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ సెక్ష‌న్ జనాభాను పెంచుతున్న‌ట్లు అవుతుంద‌ని కోర్టు పేర్కొన్న‌ది.
 
పిటిష‌న్‌లో పేర్కొన్న అంశాల‌న్నింటినీ తీరిస్తే అప్పుడు ఇక వాళ్లు ఏమీ ప‌నిచేయ‌లేర‌ని కోర్టు వెల్ల‌డించింది. ఇండ్లు లేని వాళ్లకు ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను ఉచితంగా వాడుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. పిటిష‌న్‌లో నిరాశ్ర‌యులు ఎవ‌ర‌న్న అంశం స‌రిగా లేద‌ని, ఎంత మందికి న‌గ‌రంలో ఇండ్లు లేవ‌న్న విష‌యాన్ని కూడా పేర్కొనలేద‌ని ధ‌ర్మాసనం అభిప్రాయ‌ప‌డింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments